Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై 8 మంది టీచర్ల గ్యాంగ్ రేప్: వీడియో తీశారు.. గర్భం దాల్చకుండా మందులు కూడా?

చిన్నా, పెద్దా తేడా లేకుండా మహిళలపై కామాంధులు పెచ్చరిల్లిపోతున్నారు. చిన్నారులు, బాలికలని కూడా చూడకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. అలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై 8 మంది ఉప

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (18:18 IST)
చిన్నా, పెద్దా తేడా లేకుండా మహిళలపై కామాంధులు పెచ్చరిల్లిపోతున్నారు. చిన్నారులు, బాలికలని కూడా చూడకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. అలాంటి ఘటనే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై 8 మంది ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తన కుమార్తెపై ఎనిమిది మంది టీచర్లు అత్యాచారానికి పాల్పడ్డారని.. దాన్ని వీడియో కూడా తీశారని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజస్థాన్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. 2015 ఏప్రిల్‌లో 13 ఏళ్ల బాలికపై 8 మంది టీచర్లు కలిసి 17 నెలలపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేన్సర్ లాంటి లక్షణాలతో బాధపడుతున్న తన కుమార్తెపై దారుణానికి పాల్పడడమే కాకుండా గర్భం దాల్చకుండా మందులు కూడా ఇచ్చారని బాధితురాలి తండ్రి ఆరోపించారు.

కేసును విచారించేందుకు ప్రభుత్వం మహిళా ప్యానెల్‌ను నియమించింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం