Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డు సృష్టించిన గెహ్లాట్ సర్కార్ : నగదు రహిత ఆరోగ్య బీమా

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (06:31 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ సరికొత్త రికార్డు సృష్టించింది. అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలకు నగదు రహిత మెడి‌క్లెయిమ్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
ఈ మేరకు ‘చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ పథకం’ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. 2021-22 బడ్జెట్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ప్రారంభంతో రాజస్థాన్ రికార్డు సృష్టించింది. రాష్ట్ర ప్రజలందరికీ ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అందిస్తున్న దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డులకెక్కింది. 
 
పథకంలో భాగంగా రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి ఏడాది 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా లభిస్తుంది. రాష్ట్ర ప్రజలందరికీ రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తున్న తొలి రాష్ట్రంగా రాజస్థాన్ అవతరించిందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. 
 
ఈ బీమా పథకం కోసం ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరికీ నగదు రహిత వైద్య చికిత్సను అందిస్తామని తెలిపారు. ఈ పథకం కోసం నేటి (ఏప్రిల్ 1) నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్టు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను కూడా ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments