రికార్డు సృష్టించిన గెహ్లాట్ సర్కార్ : నగదు రహిత ఆరోగ్య బీమా

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (06:31 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ సరికొత్త రికార్డు సృష్టించింది. అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలకు నగదు రహిత మెడి‌క్లెయిమ్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
ఈ మేరకు ‘చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ పథకం’ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. 2021-22 బడ్జెట్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ప్రారంభంతో రాజస్థాన్ రికార్డు సృష్టించింది. రాష్ట్ర ప్రజలందరికీ ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అందిస్తున్న దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డులకెక్కింది. 
 
పథకంలో భాగంగా రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి ఏడాది 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా లభిస్తుంది. రాష్ట్ర ప్రజలందరికీ రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తున్న తొలి రాష్ట్రంగా రాజస్థాన్ అవతరించిందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. 
 
ఈ బీమా పథకం కోసం ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరికీ నగదు రహిత వైద్య చికిత్సను అందిస్తామని తెలిపారు. ఈ పథకం కోసం నేటి (ఏప్రిల్ 1) నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్టు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను కూడా ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments