Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌భవన్ నుంచి ప్రేమలేఖ అందింది.. గవర్నరుతో టీ తాగేందుకు వెళ్తున్నా : అశోక్ గెహ్లాట్

Webdunia
బుధవారం, 29 జులై 2020 (19:27 IST)
రాజస్థాన్ రాజ్ భవన్ నుంచి తనకు ప్రేమ లేఖ అందిందని, ఇపుడు గవర్నరుతో కలిసి టీ తాగేందుకు అక్కడకు వెళుతున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలంటూ ఆ రాష్ట్ర మంత్రివర్గం చేసిన విజ్ఞప్తిని గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ముచ్చటగా మూడోసారి తిరస్కరించారు. 
 
కాగా, ఈ నెల 31వ తేదీన అసెంబ్లీని సమావేశపరచాలంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన ప్రతిపాదనను గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు పంపించారు. దీన్ని పరిశీలించిన గవర్నరు తిరస్కరించారు.
 
అసెంబ్లీని ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నదీ సరైన కారణం చెప్పేందుకు కేబినెట్ తిరస్కరించడం వల్లే ఈ ప్రతిపాదనను వెనక్కి పంపుతున్నట్టు గవర్నర్ వివరణ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశానికి ప్రభుత్వం సరైన కారణం చెప్పకుంటే 21 రోజుల నోటీసు కోరవచ్చని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాదు, తనకు మళ్లీ ప్రతిపాదనలు పంవచ్చని సూచించారు.
 
దీనిపై ముఖ్యమంత్రి గెహ్లాట్ స్పందిస్తూ, రాజ్‌భవన్ నుంచి తనకు 'ప్రేమలేఖ' అందిందని, ఇప్పుడు తాను గవర్నర్‌తో కలిసి టీ తాగేందుకు మాత్రమే వెళ్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్థాన్‌లో మొదలైన రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments