Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాకీల కళ్లలో కారం కొట్టి.. నిందితుడిని కాల్చి చంపిన దుండగులు

Webdunia
గురువారం, 13 జులై 2023 (13:55 IST)
ఓ హత్య కేసులోని నిందితులను కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువెళ్తున్న పోలీసుల వాహనంపై ఓ ముఠా దాడి చేసింది. పోలీసుల కళ్లలో కారం కొట్టి ఆ నిందితులపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఓ నిందితుడు ప్రాణాలు కోల్పోగా.. మరో నిందితుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బుధవారం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 2022లో జరిగిన స్థానిక భాజపా నేత కృపాల్ జఘీనా హత్య కేసులో కుల్దీప్ జఘీనా, విజయ్ పాల్ అనే వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. వీరిని కోర్టులో కోర్టులో హాజరుపరిచేందుకు స్థానిక పోలీసులు రాజస్థాన్ రవాణాసంస్థకు చెందిన బస్సులో బయలుదేరారు. 
 
ఈ విషయం తెలుసుకున్న దండగులు హలేనా పోలీస్ స్టేషను పరిధిలో ఉన్న అమోలీ టోల్లాజా వద్దకు ఓ కారుతోపాటు రెండు బైకులపై వచ్చిన 12 మందికి పైగా సాయుధులైన దుండగలు వచ్చి, బస్సులోకి ప్రవేశించారు. ఎస్కార్టుగా ఉన్న పోలీసులపై కారం చల్లి ఇద్దరు నిందితులపై కాల్పులు జరిపి పారిపోయారు. 
 
వారిలో నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. గాయపడిన నిందితులను స్థానిక ఆస్పత్రికి తరలించగా కుల్దీప్ జఫీనా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో నిందితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments