రాజస్థాన్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. చంబల్ నదిలో కారు బోల్తాపడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోరం శనివారం రాత్రి జరిగింది. పెళ్లి ఊరేగింపుతో వెళుతున్న కారు ఒకటి అతివేగం కారణంగా నయాపురా సమీపంలోని చంబల్ నదిలోకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వరుడు సహా తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. వీరంతా వధువు ఇంటికి వివాహానికి వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో కారులోని తొమ్మిది మంది చనిపోయారు.