Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నటుడు ఎర్రకోట అల్లర్లలో నిందితుడు దీప్ సిద్ధూ మృతి

నటుడు ఎర్రకోట అల్లర్లలో నిందితుడు దీప్ సిద్ధూ మృతి
, బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (10:04 IST)
ప్రముఖ పంజాబీ నటుడు, సామాజిక ఉద్యమకారుడు, ఎర్రకోట అల్లర్లలో నిందితుడు దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. హర్యానాలోని సోనిపట్‌ దగ్గర ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి భటిండా వైపు వెళ్తుండగా రాత్రి 9.30గంటల ప్రాంతంలో సోనిపట్‌ దగ్గర సిద్ధూ కారు ఓ స్టేషనరీ ట్రక్‌ను ఢీకొట్టింది.
 
కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమంలో దీప్‌ సిద్ధూ పాల్గొన్నాడు. 2021లో రైతులు చేపట్టిన రిపబ్లిక్‌ డే పరేడ్‌ సందర్భంగా ఎర్రకోట దగ్గర చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో కీలక నిందితుడిగా సిద్ధూ ఉన్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాదాల మధ్య తిరుమలలో అంజనాద్రి అభివృద్థికి భూమి పూజ...!