Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతల్లిపై నీచానికి ఒడిగట్టిన కుమారుడు.. నగ్న ఫోటోలను వాట్సాప్ గ్రూపులో పెట్టి?

Webdunia
మంగళవారం, 19 మే 2020 (16:46 IST)
ఆధునిక పోకడల కారణంగా మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. కన్నతల్లిపై ఓ ప్రబుద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆస్తి కోసం కన్నతల్లి  నగ్న చిత్రాలను వాట్సాప్ గ్రూపులో పంచి నీచానికి ఒడిగట్టాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన ఓ 75ఏళ్ల వద్ధురాలి భర్త 22 రోజుల క్రితమే మరణించాడు. 
 
అప్పటినుంచి ఆస్తి తన పేరున రాయాలంటూ ఆమె 50 ఏళ్ల కుమారుడు తల్లిని పీక్కుతినడం మొదలెట్టాడు. ఈ క్రమంలో మే 13న పనిలో నిమగ్నమైన తల్లిపై ఏదో ద్రవ పదార్థం చల్లాడు. దీంతో ఆమె చర్మంపై దురద మొదలవగా, వెంటనే స్నానానికి వెళ్లి బట్టలు మార్చుకుంది. దీన్నంతటినీ ఆమె కుమారుడు దొంగచాటుగా ఫొటోలు తీశాడు. 
 
అనంతరం ఆమె నగ్న ఫొటోలను వాట్సాప్‌లో బంధువులకు పంపించి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. ఆస్తి పత్రాలపై సంతకం పెట్టాలంటూ వేధించాడు. కొడుకు చేసిన నీచపనికి ఆక్రోశం చెందిన తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments