Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్‌డౌన్ అయి ఆగివున్న బస్సును ఢీకొన్న ట్రక్కు... 11 మంది మృతి

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (09:59 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్‌డౌన్ అయి రోడ్డు పక్కన ఆగివున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మృత్యువాతపడగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం బుధవారం ఉదయం జరిగింది. అలాగే, మంగళవారం కూడా ఇదే రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 
 
గుజరాత్ నుంచి మధురకు కొందరు ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు ఒకటి జైపూర్ - ఆగ్రా జాతీయ రహదారిపై బ్రేక్ డౌన్ అయి రోడ్డుపక్కన ఆగిపోయింది. ఈ క్రమంలో వెనుక నుంచి అమిత వేగంతో వచ్చిన ఓ ట్రక్.. ఆ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో వున్న ప్రయాణికుల్లో 11 మంది చనిపోగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. కాగా, ఇదే రాష్ట్రంలోని హనుమాన్‌గఢ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments