పలు చోట్ల భారీ వర్షాలు.. శని, ఆదివారాల్లో..

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (10:26 IST)
ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో శని, ఆదివారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ ప్రాంతంపై 4.5 కిలోమీటర్ల ఎత్తూ వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. 
 
అక్కడి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా తమిళనాడు తీరం వరకూ గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని చెప్పింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
 
ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
 
మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలిపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ట్వీట్‌ చేసింది. సోమ, మంగళవారాల్లోనూ అక్కడక్కడా లేదా ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయమని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments