Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రమాదాల నివారణకు ఏఐ టెక్నాలజీ : రైల్వే బోర్డు నిర్ణయం

ఠాగూర్
బుధవారం, 21 ఆగస్టు 2024 (12:37 IST)
దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఏఐ సాంకేతికతతో పని చేసే సీసీ కెమెరాలు అసాధారణ పరిస్థితులను గుర్తిస్తాయని, భద్రతా చర్యలను మెరుగుపరచడంలో ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని రైల్వే బోర్డు చైర్‌పర్సన్ జయవర్మ సిన్హా తెలిపారు. 
 
రైల్వే భద్రతపై ఆమె మాట్లాడుతూ, వచ్చే యేడాది కుంభమేళా నేపథ్యంలో సంఘవిద్రోహులు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా భద్రతా సంస్థలు రైల్వే ట్రాకులపై నిరంతర నిఘా ఉంచుతాయని సిన్హా, స్పష్టం చేశారు. ఈ మేరకు కుంభమేళా సన్నాహాలను సమీక్షించారు. కుంభమేళా ప్రారంభానికి ముందే అవసరమైన మౌలిక సదుపాయాలు, విస్తరణ ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
2019 కుంభమేళా సందర్భంగా సుమారు 530 ప్రత్యేక రైళ్లను నడిపారని ఆమె ప్రస్తావించారు. ఇక 2025లో జరిగే కుంభమేళా కోసం దాదాపు 900 ప్రత్యేక రైళ్లు నడపనున్నామని ప్రకటించారు. ఇక ఈ కుంభమేళాకు 30 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో రద్దీ నివారణకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని సిన్హా వెల్లడించారు. ప్రయాగ్ రాజ్ జంక్షన్‌ను అమృత్ భారత్ స్టేషన్‌గా ఎంపిక చేశామని ఆమె వెల్లడించారు.
 
ఇక దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆమె అన్నారు. ఆధునికీకరణ, భద్రతా చర్యల కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నప్పటికీ పట్టాలు తప్పడం, రైళ్లు ఢీకొనడం, లెవెల్ క్రాసింగ్ కారణంగా ప్రమాద ఘటనలు జరుగుతూనే ఉన్నాయని ప్రస్తావించారు. కాగా గత ఐదేళ్లలో దేశంలో అనేక రైల్వే ప్రమాదాలు జరిగాయి. భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments