Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ చేస్తారా? రైల్వే మంత్రి ఏమన్నారు?

ఠాగూర్
గురువారం, 12 డిశెంబరు 2024 (10:45 IST)
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థగా గుర్తింపు పొందిన భారతీయ రైల్వేను ప్రైవేటీకరణ చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. దీనిపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ స్పందించారు. రైల్వేను ప్రైవేటుపరం చేసే ఉద్దేశమే లేదని ఆయన స్పష్టం చేశారు.
 
ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులోభాగంగా, రైల్వేలను ప్రైవేటు పరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ దీనిపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. రైల్వే బోర్డు పని తీరును మెరుగుపర్చేందుకు ఉద్దేశించిన రైల్వే (సవరణ) బిల్లు - 2024కు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపిందని తెలిపారు. 
 
ఈ బిల్లు సుదీర్ఘ చర్చ అనంతరం మూజువాణి ఓటుతో సభామోదం పొందింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ .. ప్రతిపక్షాల విమర్శలను కొట్టిపారేశారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టించ వద్దని హితవు పలికారు. 
 
రైల్వే రంగాన్ని మరింత మెరుగుపరచడానికి, బోర్డు స్వతంత్రతను పెంపొందించేందుకు రైల్వే సవరణ బిల్లు తెచ్చామన్నారు. రైల్వేలను అధునీకరించడం, పటిష్టం చేయడం ప్రభుత్వ ఉద్దేశమని, రైల్వేల భద్రతపై ఎలాంటి రాజీ ఉండదని ఆయన అన్నారు. రైల్వే సవరణ బిల్లుతో రైల్వే బోర్డు మరిన్ని స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతుందని మంత్రి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments