Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jagan: షిప్‌ దగ్గరకు మాత్రం పవన్ ఎందుకు వెళ్లలేదు.. జగన్ ప్రశ్న

సెల్వి
గురువారం, 12 డిశెంబరు 2024 (10:32 IST)
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సెటైర్లు విసిరారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు, గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు.
 
ప్రతినెలా ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రేషన్ బియ్యం వ్యవహారంపై వారి కథనాలు, మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. కాకినాడ పోర్టులో కస్టమ్స్‌ వాళ్లు, భద్రతా సిబ్బంది వాళ్లే అని అటు కేంద్రంలోనూ వాళ్లే ఉన్నారు, రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారన్నారు.
 
మరి ఎవరిమీద నిందలు వేస్తారు? ఎవరిమీద దుష్ప్రచారం చేస్తారు? అని జగన్ నిలదీశారు. ఆర్థిక మంత్రి పయ్యావుల సొంత వియ్యంకుడు బియ్యాన్ని ఎగుమతిచేస్తున్నారని కాని ఆ షిప్‌ దగ్గరకు మాత్రం డిప్యూటీ సీఎం వెళ్లలేదన్ని మండిపడ్డారు. 
 
పయ్యావుల వియ్యంకుడు బియ్యం ఎగుమతుల్లో నంబర్‌ వన్ అని జగన్ మండిపడ్డారు. మరి వ్యవస్థీకృత నేరాలు ఎవరు చేస్తున్నారు అని నిలదీశారు. బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నంబర్‌ వన్ అన్ని దశాబ్దాలుగా బియ్యం ఎగుమతులు ఇక్కడ నుంచే జరుగుతున్నాయన్నారు. 
 
అదనంగా పండించే బియ్యాన్ని ఎగుమతి చేయడంలో తప్పులేదని… కాని దీన్ని ఇప్పుడు ట్విస్ట్‌ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments