Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రమాదంపై చట్టబద్ధ విచారణ ప్రారంభించాం : రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (13:07 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్విన్ వైష్ణవ్ స్పందించారు. ఈ ప్రమాదంపై చట్టబద్ధమైన విచారణ ప్రారంభించినట్టు చెప్పారు. అలాగే, రైలు ప్రమాదం ఘటన వివరాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా వివరించినట్టు తెలిపారు. 
 
కాగా, గురువారం రాత్రి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గౌహతి నుంచి బికనీర్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు జుల్పాయ్‌గురి జిల్లాలోని దోహోమోని అనే ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 12 బోగీలు పట్టాలు తప్పగా, ఏడుగురు మృత్యువాతపడ్డారు. 
 
ఈ ప్రమాదం గురువారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో మరో 50 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదం వార్త తెలుసుకున్న వెంటనే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంతో పాటు.. రైల్వే శాఖలు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. 
 
దేశంలో ఇటీవలి కాలంలో రైల్వే ప్రమాదాలు సంభవించలేదు. అంటే 34 నెలల తర్వాత గురువారం ఈ ప్రమాదం జరిగింది. దేశంలో చివరిసారిగా గత 2019 మార్చి 22వ తేదీన రైలు ప్రమాదం జరిగింది. ఆ తర్వాత ఇపుడు ప్రమాదం సంభవించింది. 
 
ఈ ప్రమాదంపై మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్పందించారు. రైలు ప్రమాదంపై చట్టబద్ధ విచారణ చేపట్టామన్నారు. రైలు ప్రమాద బాధితులను త్వరగా ఆదుకుంటామని చెప్పారు. అలాగే, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరిందన్నారు. 
 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం