Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రమాదంపై చట్టబద్ధ విచారణ ప్రారంభించాం : రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (13:07 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్విన్ వైష్ణవ్ స్పందించారు. ఈ ప్రమాదంపై చట్టబద్ధమైన విచారణ ప్రారంభించినట్టు చెప్పారు. అలాగే, రైలు ప్రమాదం ఘటన వివరాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా వివరించినట్టు తెలిపారు. 
 
కాగా, గురువారం రాత్రి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గౌహతి నుంచి బికనీర్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు జుల్పాయ్‌గురి జిల్లాలోని దోహోమోని అనే ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 12 బోగీలు పట్టాలు తప్పగా, ఏడుగురు మృత్యువాతపడ్డారు. 
 
ఈ ప్రమాదం గురువారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో మరో 50 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదం వార్త తెలుసుకున్న వెంటనే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంతో పాటు.. రైల్వే శాఖలు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. 
 
దేశంలో ఇటీవలి కాలంలో రైల్వే ప్రమాదాలు సంభవించలేదు. అంటే 34 నెలల తర్వాత గురువారం ఈ ప్రమాదం జరిగింది. దేశంలో చివరిసారిగా గత 2019 మార్చి 22వ తేదీన రైలు ప్రమాదం జరిగింది. ఆ తర్వాత ఇపుడు ప్రమాదం సంభవించింది. 
 
ఈ ప్రమాదంపై మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్పందించారు. రైలు ప్రమాదంపై చట్టబద్ధ విచారణ చేపట్టామన్నారు. రైలు ప్రమాద బాధితులను త్వరగా ఆదుకుంటామని చెప్పారు. అలాగే, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరిందన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం