Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇపుడున్న గ్యాస్ ధరతో అపుడు 2 సిలిండర్లు వచ్చేవి : రాహుల్

Webdunia
ఆదివారం, 8 మే 2022 (15:40 IST)
ఇపుడున్న గ్యాస్ ధరలతో అపుడు రెండు సిలిండర్లు వచ్చేవని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తాజాగా గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరపై రూ.50 మేరకు పెంచింది. మార్చి 22న సిలిండర్‌పై రూ.50 పెంచిన చమురు సంస్థలు తాజాగా మరో 50 రూపాయలు పెంచడం గమనార్హం. 
 
ఇక ఈ నెల 1న వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌పై రూ.102 పెంచిన సంగతి తెలిసిందే. దీంతో 19 కిలోల సిలిండర్‌ ధర రూ.2355.50కు చేరింది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం వల్లే గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచాల్సి వచ్చినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. ఏప్రిల్‌ 2021 నుంచి ఇప్పటి వరకు సిలిండర్‌పై రూ.190 పెరగడం గమనార్హం. ఈ ధరల పెరుగుదలపై రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్ హయాంలో పోలిస్తే గ్యాస్ ధరలు రెండింతలయ్యాయని విమర్శించారు. 
 
"ఇపుడున్న గ్యాస్ ధరతో 2014లో రెండు సిలిండర్లు వచ్చేవి. 2014లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఒక్క గ్యాస్ ధర రూ.410. సబ్సీడీగా రూ.827 ఇచ్చేవాళ్లం. కానీ, ఇపుడు గ్యాస్ ధర రూ.1000 అయింది. సబ్సీడీగా సున్నా ఇస్తున్నారు" అంటూ మండిపడ్డారు. దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని రాహుల్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments