Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్‌పై అనర్హతను ఎత్తివేసిన లోక్‌సభ సచివాలయం

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2023 (12:13 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. ఆయనపై గతంలో విధించిన అనర్హత వేటును లోక్‌సభ సచివాలయం సోమవారం ఎత్తివేసింది. ఈ మేరకు సోమవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆయన మళ్లీ సభలో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాల సమావేశాలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సమావేశాల్లో రాహుల్ పాల్గొంటారా లేదా అన్నది తేలాల్సివుంది. 
 
మోడీ ఇంటి పేరుతో ఉండేవారంతా దొంగలే అంటూ గత 2013లో జరిగిన కర్నాటక ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్ మాజీ హోం మంత్రి పూర్ణేష్ మోడీ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ ఈ యేడాది మార్చి 23వ తేదీన దోషిగా నిర్ధారించింది. ఆ మరుక్షణమే రాహుల్ గాంధీపై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
అప్పటి నుంచి రాహుల్ గాంధీ న్యాయపోరాటం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు రాహుల్ పిటీషన్‌పై విచారణ జరిపి... సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల శిక్షా కాలంపై స్టే విధించడంతో పాటు ఎంపీ హోదాను తిరిగి పునరుద్ధరించింది. ఈ మేరకు గత శుక్రవారం అపెక్స్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కోర్టు తీర్పుతో రాహుల్ తాజాగా తన ఎంపీ సభ్యత్వాన్ని తిరిగి పొందగలిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mirai: కూలిపోతున్న వంతెన మీద స్టిక్ తో మిరాయ్ లో తేజ లుక్

ఎమోషనల్‌గా కట్టి పడేసే బ్యూటీ టీజర్... సెప్టెంబర్ రిలీజ్

Haivan: ప్రియదర్శన్, అక్షయ్ ఖన్నా, సైఫ్ అలీఖాన్ కాంబినేషన్ లో హైవాన్ ప్రారంభమైంది

వార్ 2 పంపిణీతో బాగా నష్టపోయిన నాగ వంశీ, క్షమించండి అంటూ పోస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments