Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు నష్టం దావా కేసు : హైకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (09:02 IST)
పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. మోడీ ఇంటి పేరును కించపరిచారనే పరువు నష్టం కేసులో రాహుల్ ఈ తాజా పిటిషన్‌ను దాఖలు చేశారు. తనకు విధించిన శిక్షను వాయిదా వేయాలన్న అభ్యర్థనను కింది కోర్టు తిరిస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. గత 2019లో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోడీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 
 
దీనిపై గుజరాత్‌కు చెందిన బీజేపీ నేత పూర్ణేష్ మోడీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేయగా, కేసును విచారించిన కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చి రెండేళ్ల జైలుశిక్షను విధించింది. దీంతో రాహుల్ గాంధీపై లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటువేసింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో రాహుల్ తన అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేశారు. 
 
సూరత్ కోర్టు తనకు విధించిన రెండేళ్ళ జైలుశిక్షను నిలుపుదల చేయాలంటూ ఆయన సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏప్రిల్ 3న విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణలో భాగంగా ఏప్రిల్ 13న ఇరు పక్షాల వాదనలు ఆలకించిన కోర్టు పిటిషన్లను తిరస్కరించింది. దీంతో రాహుల్ హైకోర్టును ఆశ్రయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయుడు2 లో క్యాలెండర్ సాంగ్ చేస్తున్న మోడల్ డెమి-లీ టెబో

కల్కి మొదటి వారాంతం హిందీ, ఉత్తర అమెరికా కలెక్టన్ల వివరాలు

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments