Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు నష్టం దావా కేసు : హైకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (09:02 IST)
పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. మోడీ ఇంటి పేరును కించపరిచారనే పరువు నష్టం కేసులో రాహుల్ ఈ తాజా పిటిషన్‌ను దాఖలు చేశారు. తనకు విధించిన శిక్షను వాయిదా వేయాలన్న అభ్యర్థనను కింది కోర్టు తిరిస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. గత 2019లో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోడీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 
 
దీనిపై గుజరాత్‌కు చెందిన బీజేపీ నేత పూర్ణేష్ మోడీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేయగా, కేసును విచారించిన కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చి రెండేళ్ల జైలుశిక్షను విధించింది. దీంతో రాహుల్ గాంధీపై లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటువేసింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో రాహుల్ తన అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేశారు. 
 
సూరత్ కోర్టు తనకు విధించిన రెండేళ్ళ జైలుశిక్షను నిలుపుదల చేయాలంటూ ఆయన సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఏప్రిల్ 3న విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణలో భాగంగా ఏప్రిల్ 13న ఇరు పక్షాల వాదనలు ఆలకించిన కోర్టు పిటిషన్లను తిరస్కరించింది. దీంతో రాహుల్ హైకోర్టును ఆశ్రయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments