Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురుగు నీటి గుంతలో పడి రేడియో మిర్చి ఉద్యోగి ప్రాణాలు కోల్పోయింది...

ప్రభుత్వ అధికారుల ఉదాసీనత వల్ల ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే, రహదారులపై తగిన హెచ్చరిక గుర్తులు లేకపోవడం వల్ల వాహనచోదకులు సైతం ప్రమాదాలకు గురై చనిపోతున్నారు.

Webdunia
బుధవారం, 2 మే 2018 (15:38 IST)
ప్రభుత్వ అధికారుల ఉదాసీనత వల్ల ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే, రహదారులపై తగిన హెచ్చరిక గుర్తులు లేకపోవడం వల్ల వాహనచోదకులు సైతం ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. తాజాగా, మురుగు నీటి గుంతలో పడి రేడియే మిర్చిలో పని చేసే ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాద వివరాలను పరిశీలిస్తే...
 
రేడియో మిర్చి మార్కెటింగ్ టీమ్‌లో పని చేస్తున్న తాన్యా ఖన్నా (26) మంగళవారం రాత్రి 2.30 గంటల సమయంలో నోయిడాలోని సెక్టర్ 94 రోడ్డులో కారులో వెళుతుండగా, అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న మురుగు నీటిగుంతలో పడిపోయింది. ఆమె తన వెర్నా కారుతో సహా ఈ గుంతలో బోల్తాపడింది. ఆమె ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా జరిగిన ఓ సమావేశంలో పాల్గొని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. 
 
ఓ కారు వేగంగా మురికి నీటి గుంతలోకి దూసుకెళ్ళిపోవడాన్ని గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి, సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి, కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments