Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిక్కుల పవిత్ర పతాకాన్ని అపవిత్రం చేశాడనీ.. వ్యక్తిని కొట్టి చంపేసారు...

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (15:57 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. సిక్కుల పవిత్ర పతాకమైన నిషాన్ సాహిబ్‌ను అపవిత్రం చేశాడన్న అక్కసుతో ఓ వ్యక్తిని కొందరు సిక్కులు కొట్టి చంపేశారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. 
 
సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయంలో శనివారం రాత్రి ఓ వ్యక్తిని కొట్టి చంపిన విషయం తెల్సిందే. గర్భగుడిలోకి ప్రవేశించి బీభత్స సృష్టించినందుకు ఆ యువకుడిపై కొందరు సిక్కు భక్తులు ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే పంజాబ్‌లో అదే తరహాలో ఘటన జరిగింది. 
 
పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలా జిల్లా నిజాంపూర్ గ్రామంలో ఓ గురుద్వారాలోకి ఓ వ్యక్తి ప్రవేశించి, సిక్కుల పవిత్ర జెండా నిషాన్ సాహిబ్‌ను అపవిత్రం చేస్తూ కొందరు సిక్కుల కంటపడ్డారు. ఇంతలో అక్కడకు వచ్చిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 
 
కానీ, ఆ వ్యక్తిని తమ ఎదుటే విచారించాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులు, గ్రామస్థుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆ యువకుడిపై గ్రామస్థులు దాడి చేయడంతో ఆ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. అమృతసర్‌లో ఓ ఘటన జరిగిన 24 గంటల్లోనే పంజాబ్‌లో ఇదే తరహా ఘటన జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments