Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికతో ప్రేమికుడి సహజీవనం - ఓకే చెప్పిన హైకోర్టు

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (09:36 IST)
పంజాబ్ - హర్యానా హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. మైనారిటీ కూడా తీరని ఓ మైనర్ బాలికతో ప్రేమికుడు సహజీవనం చేసేందుకు కోర్టు సమ్మతించింది. సహజీవనం చేయాలని జంట నిర్ణయించుకున్నందున తీర్పులు ఇవ్వకూడదని తేల్చి చెప్పింది. 
 
పంజాబ్‌లోని బఠిండాలో నివసించే ఒక జంట వేసిన వేసిన పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు... వివాహం చేసుకోకుండానే పిటీషనర్లు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు, వారి నిర్ణయంలో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని జస్టిస్ సత్ ప్రకాశ్ వ్యాఖ్యానించారు. 
 
మైనారిటీ కూడా తీరని ఒక యువతి (17), 20 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. బాలికకు మరో పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సమాయత్తం కాగా, ఈ జంట కోర్టును ఆశ్రయించింది. తల్లిదండ్రుల ప్రయత్నాలు తెలిసి ఇళ్లు విడిచి ప్రేమికుడి వద్దకు చేరుకున్నానని, రక్షణ కల్పించాలని వేడుకుంది. 
 
బాలిక మైనరిటీ తీరకపోవడంతో 18 ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అప్పటివరకు సహజీవనం చేస్తామని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో జంటకు రక్షణ కల్పించడం మా బాధ్యత అని హైకోర్టు జడ్జి జస్టిస్ సంత్ ప్రకాశ్ వ్యాఖ్యానించి, ఆ జంటకు భద్రత కల్పించాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments