Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి రెవెన్యూ లోటు కింద రూ.1438 కోట్లు విడుదల

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (08:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాలతో కూడిన సీమాంధ్ర ప్రదేశ్ తీవ్రమైన రెవెన్యూ లోటును ఎదుర్కోంటుంది. ఈ లోటును విభజన హామీల్లో భాగంగా కేంద్రం భర్తీ చేయాల్సివుంది. కానీ కేంద్ర ఆ పని చేయడం లేదు. నామమాత్రంగానే రెవెన్యూ లోటును భర్తీ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.1,438 కోట్లను కేంద్రం విడుదల చేసింది. 
 
ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను 17 రాష్ట్రాలకు మొత్తం రూ.9,871 కోట్లను మూడో విడత రెవెన్యూలోటు భర్తీ కింద విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,438 కోట్లు దక్కాయి. వీటితో కలుపుకుని రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ.4,314.24 కోట్లు అందాయి.
 
కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను 17 రాష్ట్రాలకు కలిపి రూ.1,18,452 కోట్ల రెవెన్యూ గ్రాంటును విడుదల చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేయగా, ఈ మొత్తాన్ని 12 వాయిదాల్లో చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మొత్తం వాయిదాల్లో కలిపి ఏపీకి మొత్తంగా రూ.17,256.96 కోట్లు రానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments