Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతి కేసులో ఐఏఎస్ అరెస్టు - మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 26 జూన్ 2022 (11:13 IST)
పంజాబ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. అవినీతి కేసులో ఐఏఎస్ అధికారి అరెస్టు అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు తీవ్ర మనస్తాపానికిగురై ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి తుపాకీతోనే కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చండీఘడ్‌‍లో వెలుగు చూసింది. 
 
గత 2008 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సంజయ్ పోప్లీ పంజాబ్‌లో అధికారిగా ఉన్నారు. ఈయనను ఓ అవినీతి కేసులో ఇటీవల పంజాబ్ విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఈయన రిమాండ్ ముగియనుంది. 
 
ఈ క్రమంలో ఆయన నివాసంలో తనిఖీలు చేసేందుకు విజిలెన్స్ అధికారులు ఆయన నివాసానికి బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న ఐపీఎస్ అధికారి సంజయ్ పొప్లీ తనయుడు కార్తీక్ పొప్లీ తన తండ్రి తుపాకీ తీసుకుని తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ విషాద ఘటనతో పొప్లీ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. విజిలెన్స్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజిలెన్స్ అధికారులో తమ కుమారుడిని పొట్టనబెట్టుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments