Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి 14 మంది మృతి

ఠాగూర్
మంగళవారం, 13 మే 2025 (10:25 IST)
పంజాబ్‌లో ఘోరం జరిగింది. కల్తీ మద్యం తాగి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పలువురు నిందితులు అదుపులోకి తీసుకున్నారు.
 
అధికారులు తెలిపిన వివరాల మేరకు.. అమృతసర్‌లోని మజితా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కల్తీ మద్యం తాగి పలువురు మృతి చెందారు. మరో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే చర్యలు తీసుకుని ప్రధాన నిందితుడైన ప్రబ్జీత్‌ సింగ్‌తో పాటు మరికొంతమందిని అరెస్టు చేశారు. విచారణ సమయంలో సహబ్ సింగ్ అనే మరో నిందితుడి పేరు వెల్లడైంది. 
 
అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడి నుంచి ఈ మద్యాన్ని తీసుకొచ్చారనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఇదే మద్యం తాగిన మరికొంతమందిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. కల్తీ మద్యం తయారీదారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ కేసుపై రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments