Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొన ఊపిరితో కొట్టుకుంటుంటే కాపాడలేదు.. ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ?

స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఆపదలో వున్నా.. ఆ ఘటనను వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకే చాలామంది ఆసక్తి చూపుతున్నారే కానీ... ప్రమాదంలో వున్న వ్య

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (18:53 IST)
స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఆపదలో వున్నా.. ఆ ఘటనను వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకే చాలామంది ఆసక్తి చూపుతున్నారే కానీ... ప్రమాదంలో వున్న వ్యక్తుల్ని కాపాడేందుకు ముందుకు రావట్లేదు. ఇలాంటి ఘటనే పుణేలో చోటుచేసుకుంది. 
 
ఓ వైపు పక్క మనిషి రక్తమోడుతూ కొనవూపిరితో కొట్టుకుంటుంటే.. అటువైపుగా వెళ్లే పాదచారులు చూస్తూ ఉన్నారే కాని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించలేదు. పైగా మానవత్వం మరిచి ఫోటోలు.. వీడియోలు తీసుకుంటూ చోద్యం చూశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే... పుణెకు చెందిన 25ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సతీష్‌ ప్రభాకర్‌ మెటే భోసారి ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. రోడ్డుపై రక్తమోడుతూ రోడ్డుపై పడివున్న ఆ వ్యక్తి ఎవ్వరూ కాపాడేందుకు ప్రయత్నించలేదు. పాదచారులు ఆయన్ని కాపాడకుండా ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ చూస్తుండిపోయారు. కొద్ది సేపటికి భోసారికి చెందిన డెంటిస్టు కార్తీక్‌రాజ్‌ రక్తంలో పడి ఉన్న సతీష్‌ను గమనించాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. 
 
తలకు తీవ్ర గాయం కావడంతో అతని ప్రాణాలను కాపాడలేకపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే అతడిని చూసిన వాళ్లు ఫొటోలు, వీడియోలు తీసుకోకుండా ఆసుపత్రికి తరలించి ఉంటే అతడు ప్రాణాలను కోల్పోయే వాడు కాదని కార్తీక్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments