Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరిలో శుభకార్య వేదికగా పోలింగ్ కేంద్రాలు

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (09:36 IST)
కేంద్ర పాలితప్రాంతమైన పుదుచ్చేరి రాష్ట్ర శాసనసభకు మంగళవారం పోలింగ్ జరుగుతోంది. మొత్తం 30 సీట్లున్న పుదుచ్చేరి రాష్ట్ర శాసనసభకు ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే, ఈ పోలింగ్ కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు శుభకార్యాల వేదికలను తలపిస్తున్నాయి. 
 
పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఆకర్షించేందుకు అధికారులు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. శుభకార్యం జరుగుతున్న వేదికల్లా పోలింగ్ కేంద్రాలను అలంకరించారు. రంగురంగుల బెలూన్లతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. 
 
పోలింగ్ కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద బెలూన్లతోపాటు రంగురంగుల కాగితపు తోరణాలను ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఎండలో ఇబ్బంది లేకుండా షామియానాలు ఏర్పాటు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
 
కాగా, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments