Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొంపముంచుతున్న ఆ‌న్‌లైన్ గేమ్‌లు.. పబ్జీతో బాలుడి మృతి

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (12:15 IST)
ఆన్‌లైన్ గేమ్‌లతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా యువత ఆన్ లైన్ గేమ్‌ల ద్వారా సమయాన్ని వృధా చేసుకోవడంతో పాటు.. మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు. తాజాగా పబ్జి గేమ్ ఓ బాలుడి ప్రాణం తీసింది. మంగళూరులో తప్పిపోయిన 13ఏండ్ల అకీఫ్ చనిపోయి కనపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మృతి చెందిన బాలుడికి, నిందితుడుకి మధ్య పబ్జి గేమ్ కారణంగా గొడవలు వచ్చాయి. 
 
అకీఫ్ ఎప్పుడూ గేమ్ లో గెలుస్తుండేవాడు. అకీఫ్‌కు నిందితుడితో ఓ మొబైల్ స్టోర్‌లో పరిచయం ఏర్పడింది. దీంతోవారు రెగ్యులర్‌గా గేమ్ ఆడేవారు. అలా ఆడిన ప్రతీసారి అకీఫ్ గెలుస్తుండేవాడు. దీంతో అకీఫ్ తరఫున ఎవరో ఆడుతున్నారని నిందితుడు అనుమానించాడు. 
 
అకీఫ్ ఇద్దరం కలిసి ఒకే దగ్గర కూర్చొని ఆడుదాం అని ఛాలెంజ్ చేశాడు. వారిద్దరూ శనివారం రాత్రి కూర్చొని ఆడగా.. అకీఫ్ ఓడిపోయాడు. ఇద్దరి మధ్య వాదన జరగ్గా.. అకీఫ్ నిందితుడిపై రాళ్లు విసిరాడు. నిందుతుడు కూడా పెద్ద రాయితో అకీఫ్ ను కొట్టగా అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారని సీపీ శశి కుమార్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments