Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒట్టు... ఆ ముగ్గుర్నీ ప్రేమిస్తా! వర్మ సంచలన ప్రకటన

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (13:39 IST)
నిత్యం వివాదాలు, వరుస సినిమాలతో వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్‌ వర్మ.. సంచలన ప్రకటన చేశారు. తన కర్మ పేరిట వెలసిన బ్యానర్‌కు తనదైన శైలిలో గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

రాంగోపాల్‌ వర్మ తాజాగా రూపొందించిన చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనేక అవాంతరాల అనంతరం ఈ సినిమా డిసెంబరు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనసేన యూత్‌ కోడూరుపేట పేరిట కొంతమంది.. వర్మకు శ్రద్ధాంజలి తెలుపుతూ.. బ్యానర్‌ ఏర్పాటు చేశారు.

అన్‌పార్లమెంటరీ పదాలు వాడుతూ.. ఈనెల 26న వర్మ పెద్దకర్మ చేస్తున్నామంటూ బ్యానర్‌లో పేర్కొన్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేసిన వర్మ.

‘మీ లీడరును దెయ్యమై పట్టుకోవడానికి అతి త్వరలో వస్తున్నా’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. ‘పీకే, సీబీఎన్‌, లోకేశ్‌ మద్దతుదారులు.. నా వ్యతిరేకులు. అమ్మ రాజ్యంలో సినిమాను అర్థం చేసుకోండి. ఇది కేవలం వినోదం కోసం చేసినదే.

నిజానికి నేను పీకే, సీబీఎన్‌, లోకేశ్‌ను ఎంతగానో ప్రేమిస్తాను. వారి అనుచరులందరూ ముఖ్యంగా కోడూరుపాడు జనసేన కార్యకర్తలపై ఒట్టేసి ఈ విషయం చెబుతున్నా’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments