Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్య వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్న టెక్కీ భర్త

భార్య వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్న టెక్కీ భర్త
, శనివారం, 14 డిశెంబరు 2019 (12:56 IST)
భార్య వేధింపులు తాళలేని ఓ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం గమనార్హం. ఈఘటన దేశ ఐటీ రాజధాని బెంగుళూరులో జరిగింది. శ్రీనాథ్ (39) అనే టెక్కీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా బెంగళూరులోని ఓ కంపెనీలో పనిచేస్తూ అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకున్నాడు. ఈయన పలు బ్యాంకుల్లో అప్పుచేసి ఓ సొంత ఫ్లాట్ కూడా కొనుక్కున్నాడు. అదేక్రంలో ఓ యువతిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు.
 
ఆ తర్వాత నుంచి అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి. భార్య నిత్యం చేస్తున్న దుబారా ఖర్చులు, వేధింపులు అతనికి మానసిక స్థిమితం లేకుండా చేశాయి. పైగా ఇంటిని తన తండ్రి పేరున మార్చాలంటూ భార్య నుంచి నిత్యం ఒత్తిడి చేయసాగింది. 
 
ఈ వేధింపులతో ఆ టెక్కీ విసిగిపోయాడు. తాను తనువు చాలిస్తేగాని తన విలువేమిటో ఆమెకు తెలిసిరాదనుకున్నాడేమో. ఇంట్లోనే ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలిని సందర్శించి ప్రాథమిక ఆధారాల మేరకు భార్య, ఆమె తల్లిదండ్రులపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైవ్‌లో మహిళా జర్నలిస్టు... పిరుదుపై కొట్టి పారిపోయిన అకతాయి.. (Video)