Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగ్జిట్ పోల్స్‌తో అధైర్యపడొద్దు : ప్రియాంకా గాంధీ

Webdunia
బుధవారం, 22 మే 2019 (08:49 IST)
ఎగ్జిట్ పోల్స్ ఓ జిమ్మిక్కు అని, ప్రత్యర్థి పార్టీలు ఇలాంటి పనులు బాగానే చేస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆమె స్పందిస్తూ, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని, మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టాలన్న ఉద్దేశ్యంతోనే ప్రత్యర్థి పార్టీలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని, ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 
 
ముఖ్యంగా, ఓట్ల లెక్కింపు జరిగే రోజైన గురువారం కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్స్ రూమ్స్ వద్ద నిఘా ఉంచాలని, తమ శ్రమకు ఖచ్చితంగా ఫలితం దక్కుతుందన్న నమ్మకం తనకు ఉందని ఆ ఆడియోలో ప్రియాంక పేర్కొన్నారు.
 
కాగా, కేంద్రంలో మళ్లీ బీజేపీయే అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. అదేసమయంలో, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments