Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్-హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని ట్వీట్

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (11:38 IST)
కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ  కరోనా టెస్టు చేయించుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కోవిడ్-19 సోకిన ఒక రోజు తర్వాత, ప్రియాంక గాంధీకి కూడా వైరస్ సోకింది.
 
ప్రస్తుతం ప్రియాంకా గాంధీ హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రియాంక గాంధీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి తాజాగా కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. 
 
ప్రియాంక వ్యక్తిగత సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ప్రియాంక గాంధీ కోవిడ్‌‌‌-19 టెస్ట్ చేయించుకున్నారు. అందులో కోవిడ్ పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది. 'తేలికపాటి లక్షణాలతో కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అన్ని ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ, నేను ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నాను' అని ఆమె ట్వీట్ చేశారు. 
 
మరోవైపు దేశంలో కరోనా విజృంభిస్తోంది. దేశంలో గత సోమవారం 6,358 కోవిడ్ కేసులుండగా ఈ సోమవారానికి ముప్పై మూడు వేలకు పెరిగాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబై సిటీ కోవిడ్‌తో వణికిపోతోంది. తాజాగా అక్కడ 8,082 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments