దేశం కోసమే మా పోరాటం : ప్రియాంకా గాంధీ

ఠాగూర్
శుక్రవారం, 6 డిశెంబరు 2024 (11:21 IST)
తమ కుటుంబం దేశం కోసం పోరాటం చేస్తున్నామని వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ అన్నారు. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. ఒకరిద్దరు తమ వ్యాపార మిత్రులకు దేశ సంపదను దోచిపెడుతోందని విమర్శలు గుప్పించారు. 
 
ఇదే అంశంపై మాట్లాడుతూ, 'ఏ వ్యవస్థలపై ఈ దేశ నిర్మాణం జరిగిందో ఆ వ్యవస్థలను అధికారంలో ఉన్న వారు నాశనం చేస్తున్నారు. అందుకే దేశం కోసం మేం పోరాటం చేస్తున్నాం' అని అన్నారు. వయనాడ్ విపత్తు బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండిచేయి చూపాయని దుయ్యబట్టారు.
 
మరోవైపు, కొద్ది మంది కుబేరులే లబ్ధి పొందున్నంత కాలం దేశం ప్రగతి సాధించ లేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానిం చారు. ఒకవైపు అభివృద్ధి ఫలాలు కొద్ది మంది కోటీశ్వరులే అందుకుంటూ మరోవైపు ఆర్థిక విపత్తుల కారణంగా రైతులు, కార్మికులు, మధ్యతర గతి ప్రజలు జీవనం కోసం పోరాడుతుంటే అది ప్రగతి అనిపించుకోదన్నారు. జీడీపీ వృద్ధి బాగా తగ్గినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

Bandla Ganesh: రవితేజకి ఆల్టర్నేట్ జొన్నలగడ్డ సిద్దు: బండ్ల గణేష్

డ్యూడ్ రూ.100 కోట్ల కలెక్షన్లు : హ్యాట్రిక్ కొట్టిన కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments