Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక పెరోల్​పై బయటకు రానున్న ఖైదీలు!

Webdunia
సోమవారం, 23 మార్చి 2020 (22:17 IST)
దేశవ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరిస్తోన్న సమయంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక దూరం పాటించేందుకు వీలుగా జైళ్లలో ఉన్న ఖైదీలకు స్పెషల్​ పెరోల్​ ఇవ్వాలని నిర్ణయించి.. ఇందుకు అనుమతించాలని దిల్లీ హైకోర్టుకు విన్నవించింది. దేశంలో క్రమంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్​ నియంత్రించేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను బయటకు పంపేందుకు నిర్ణయం తీసుకుంది దిల్లీ సర్కారు. ఈ మేరకు జైళ్లలోని ఖైదీలకు స్పెషల్​ పెరోల్​ ఇవ్వాలని సంకల్పించింది. ఇందుకు అనుమతించాలని దిల్లీ హైకోర్టుకు విన్నవించింది. ఈ ప్రత్యేక పెరోళ్ల నిబంధన.. ఖైదీలకు అమలు చేసేందుకు వీలుగా జైలు నియమాలను సవరించనున్నట్లు జస్టిస్​ హిమా కోహ్లీ, జస్టిస్​ సుబ్రహ్మణ్యం ప్రసాద్​ల ధర్మాసనానికి నివేదించింది కేజ్రీవాల్ సర్కారు.

ప్రస్తుత నిబంధనలకు అదనంగా రెండు అంశాలను చేరుస్తూ సవరణ చేయనున్నట్లు.. కోర్టుకు నివేదించారు దిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది అనూజ్ అగర్వాల్. ఒకరోజులో నోటిఫికేషన్​ జారీ చేయనున్నట్లు చెప్పారు. ఇలాంటి ప్రత్యేక పెరోల్​కు సుప్రీం గతంలో అనుమతించినట్లు న్యాయవాది పేర్కొన్నారు. ఏదైనా అంటువ్యాధి, ప్రకృతి విపత్తు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో 60 రోజుల పెరోల్​ నిబంధన వర్తిస్తుందని అగర్వాల్​ ధర్మాసనానికి గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం