Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడి పంతులుగా మారనున్న రాష్ట్రపతి.. 80 మంది విద్యార్థులకు బోధన

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సెప్టెంబర్ 5న నిర్వహించబోయే ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా టీచర్‌గా మారనున్నారు. టీచర్స్ డే సందర్భంగా రాష్ట్రపతి డాక్టర్. రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ విద్యాలయ విద్యార్థులకు పాఠా

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (15:47 IST)
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సెప్టెంబర్ 5న నిర్వహించబోయే ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా టీచర్‌గా మారనున్నారు. టీచర్స్ డే సందర్భంగా రాష్ట్రపతి డాక్టర్. రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ విద్యాలయ విద్యార్థులకు పాఠాలు చెప్పనున్నారు. అదే రోజు ఢిల్లీలో వివిధ ప్రభుత్వ పాఠశాలల టీచర్లతో ప్రణబ్ సమావేశం కానున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్కు సమీపంలో ఉన్న ఈ విద్యాలయంలో 11,12 వ తరగతి చదువుతున్న మొత్తం 80 మంది విద్యార్థులు ప్రణబ్ చెప్పబోయే పాఠాలకు హాజరు కానున్నట్టు ప్రకటన విడుదల చేశారు. 
 
ఈ కార్యక్రమాన్ని డీడీ న్యూస్, డీడీ భారతీ ఛానల్స్లో ఉదయం 10.30 గంటల నుంచి ప్రసారం చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చని, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ వెబ్కాస్ట్.గవర్నమెంట్.ఇన్ ప్రెసిడెంట్లో లైవ్గా వెబ్ కాస్ట్ చేయనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా విడుదల చేయబోయే "ఉమాంగ్ 2015" బుక్లెట్ తొలి ప్రతిని ప్రణబ్ అందుకోనున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments