Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషుల ఉరికి ఏర్పాట్లు... దోషులను వేరు చేసిన అధికారులు

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (10:40 IST)
నిర్భయ అత్యాచారం కేసులో దోషులుగా తేలిన నలుగురు నిందితులకు కోర్టు విధించిన ఉరిశిక్షలను అమలు చేసేందుకు జైలు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులోభాగంగా పలు చర్యలు చేపట్టడమేకాకుండా, జైలులో అనేక రకాలైన ఆంక్షలు కూడా విధించారు. 
 
ముఖ్యంగా నలుగురు దోషులు ఒకరినొకరు కలుసుకోకుండా, మాట్లాడుకోకుండా వేర్వేరు గదుల్లో ఉంచారు. దోషులు ముఖేశ్‌, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌ సింగ్‌‌లు ఇప్పటివరకు జైలులో ఉదయం వేళ ఒకరినొకరు కలిసి మాట్లాడుకునేవారు. 
 
అయితే, ఉరితీత సమయం దగ్గర పడుతుండడంతో వారు కలుసుకుని మాట్లాడుకోకుండా నిషేధం విధించారు. మరోవైపు, తీహార్ జైలులో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం తమిళనాడు నుంచి ప్రత్యేక పోలీసు దళాన్ని రప్పించారు. 
 
మండోలీ జైలులో ఉన్న మరో దోషి పవన్ కుమార్ గుప్తాను అత్యంత రహస్యంగా సాయుధ గార్డుల భద్రత మధ్య తీహార్ జైలుకు తీసుకువచ్చారు. జైలులోని ఉరితీసే గదిని శుభ్రం చేశారు. తుప్పు పట్టిన ఉరిస్తంభాన్ని శుభ్రం చేయించి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. 
 
మరోవైపు, నిర్భయ దోషులను వెంటనే ఉరితీయాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. మరణశిక్షను అమలుచేయడానికి మిగిలిన అన్ని ప్రక్రియలను వెంటనే పూర్తిచేసి వీలైనంత త్వరగా దోషులను ఉరితీయాలన్నారు. యావత్‌ దేశ ప్రజానీకం నిర్భయకు న్యాయం జరుగాలంటూ.. దోషులను తక్షణమే ఉరితీయాలంటూ కోరుతున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments