Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణిని కాటేసిన కరోనా వైరస్.. నిండు గర్భిణి బలి

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (11:05 IST)
కరోనా వైరస్ నిండు గర్భిణి మహిళను కాటేసింది. కరోనా వైరస్‌ కాటుకు తొమ్మిది నెలల నిండు గర్భిణి బలైంది. ముంబైలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్లసోపారా ప్రాంతానికి చెందిన ఓ మహిళ శ్వాస తీసుకోవటంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న స్థితిలో శనివారం రాత్రి ముంబైలోని బివైఎల్‌ నాయర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
 
ఈమె పరిస్థితిని బట్టి కరోనా ఉండొచ్చని అంచనా వేసిన వైద్యులు ఆమెను వెంటనే ఐసోలేషన్‌ వార్డుకు తరలించి, అత్యవసర చికిత్స అందించారు. కరోనా నిర్ధారణ పరీక్ష కూడా చేశారు. అయితే ఆమె ఆరోగ్య స్థితి మరింత దిగజారటంతో... కొద్ది గంటల్లోనే మృతిచెందింది. 
 
గర్భంలోని శిశువు కూడా మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అనంతరం వెలువడిన కొవిడ్‌-19 పరీక్షలో ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా, నాయర్‌ ఆస్పత్రికి తీసుకురావటానికి ముందు ఆమెను చేర్చుకోవటానికి రెండు ఆస్పత్రులు తిరస్కరించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments