Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంతూరుకు వలస కూలీలు ... రోడ్డుపై ప్రసవం.. ఆ వెంటనే నడక

Webdunia
బుధవారం, 13 మే 2020 (11:11 IST)
కరోనా లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా రవాణా సౌకర్యాలు బంద్ అయ్యాయి. అయితే, ఇటీవల లాక్డౌన్ ఆంక్షలను కేంద్రం సడలించింది. ముఖ్యంగా, వలస కూలీలు తమతమ సొంతూళ్ళకు వెళ్లేందుకుగాను రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు అనుమతిచ్చింది. పైగా, వలస కూలీల కోసం ప్రత్యేక రైళ్లను కూడా కేంద్రం నడుపుతోంది. అలాగే పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ ప్రాంతాలకు చెందిన వలస కూలీలను స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని మధ్యప్రదేశ్ వలస కూలీలు కూడా తమ స్వస్థలాలకు బయలుదేరారు. ఇందులో ఓ నిండు గర్భిణి కూడా తన భర్తతో కలిసి తమ స్వస్థలమైన సత్నాకు చేరుకునేందుకు కాలినడక ప్రారంభించింది. నెలలు నిండటంతో మార్గమధ్యంలోనే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో, రోడ్డు పైనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 
 
ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే, ప్రసవించిన రెండుగంటల తర్వాత తమ బిడ్డతో సహా భార్యాభర్త తిరిగి నడక ప్రారంభించారు. అప్పుడే పుట్టిన బిడ్డతో కలిసి మరో 150 కిలో మీటర్లు నడిచింది. సత్నా సరిహద్దులో వారిని అధికారులు గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments