Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‍ రాష్ట్రాన్ని జేడీయూ - ఆర్జేడీలు ముంచేశాయి : ప్రశాంత్ కిషోర్

ఠాగూర్
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (13:33 IST)
బీహార్ రాష్ట్రాన్ని జేడీయూ, ఆర్జేడీలు రెండు పార్టీలు ముంచేశాయని ప్రముఖ జాతీయ రాజకీయ వ్యూహకర్త, జన సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన గంటలోపే రాష్ట్రంలో మద్యం నిషేధం అమలు చేస్తామని ఆయన తెలిపారు. వచ్చే నెల రెండో తేదీకి తమ పార్టీ స్థాపించి ఒక యేడాది పూర్తవుతుందని, ఈ సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఆయన చెప్పారు. 
 
అదేసమయంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తొమ్మిదో తరగతి ఫెయిలైన లీడర్ బీహార్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారనీ, ఆర్జేడీ, జేడీయూ రెండూ బీహార్ రాష్ట్రాన్ని ముంచేశాయని అన్నారు. బీహార్‌లో మధ్యనిషేధం అవసరంలేదని, తాము అధికారంలోకి వచ్చిన గంటలోపల నిషేధం ఎత్తివేస్తామన్నార
 
బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న జేడీయూతో పాటు ఆర్జేడీ కూడా రాష్ట్రాన్ని నాశనం చేశాయని ఆరోపించారు. ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ యాత్ర చేపట్టడంపై ప్రశాంత్ కిశోర్ వ్యంగ్యంగా స్పందించారు. కనీసం ఇలాగైనా ఆయన ఇల్లు వదిలి ప్రజల్లోకి రావడం సంతోషకరమని అన్నారు. తొమ్మిదో తరగతి కూడా పూర్తిచేయని వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడని సెటైర్ వేశారు. తేజస్వీ యాదవ్‌కు జీడీపీకి, జీడీపీ గ్రోత్‌కు తేడా తెలియదంటూ ఎద్దేవా చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments