పరీక్షలు వాయిదా వేయించాలని.. విద్యార్థిని చంపిన స్టూడెంట్

పాఠశాలలో నిర్వహించే పరీక్షలను వాయిదా వేయించేందుకు ఓ విద్యార్థి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇందుకోసం సహచర స్టూడెంట్‌ను హతమార్చాడు. దీంతో సెప్టెంబర్ 8వ తేదీన ఢిల్లీ స్కూల్‌లో జరిగిన మర్డర్ కేసులో కొత్త కోణం

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (15:25 IST)
పాఠశాలలో నిర్వహించే పరీక్షలను వాయిదా వేయించేందుకు ఓ విద్యార్థి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇందుకోసం సహచర స్టూడెంట్‌ను హతమార్చాడు. దీంతో సెప్టెంబర్ 8వ తేదీన ఢిల్లీ స్కూల్‌లో జరిగిన మర్డర్ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. 
 
రియాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏడేళ్ల బాలుడు హత్యకు గురైన ఘటనకు సంబంధించి సీబీఐ పోలీసులు షాకింగ్ న్యూస్ బయటపెట్టారు. రెండో తరగతి చదువుతున్న ప్రద్యూమన్ థాకూర్‌ను తన సీనియర్ హత్య చేశాడని తేల్చారు. పదకొండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి.. స్కూల్ పరీక్షలు వాయిదా వేయించాలన్న ఉద్దేశంతో ప్రద్యూమన్‌ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 
 
సెప్టెంబర్ 8న ప్రద్యూమన్ స్కూల్ బాత్రూంలో శవమై కనిపించాడు. అతని గొంతు కోసి ఉంది. రక్తపుమడుగులో ఉన్న ఆ చిన్నారి శవాన్ని మొదట స్కూల్ గార్డనర్ గుర్తించాడు. రియాన్ స్కూల్ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీబీఐ పోలీసులు దాన్ని చేధించారు. ఈ కేసులో డ్రైవర్‌ను అశోక్‌ను మొదట విచారించి అరెస్టు చేశారు. 
 
అయితే మరింత లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మరో స్టన్నింగ్ అంశాన్ని గుర్తించారు. పేరెంట్ టీచర్ మీటింగ్‌ను, ఎగ్జామ్స్‌ను రద్దు చేయించాలన్న ఉద్దేశంతోనే 11వ తరగతి చదువుతున్న విద్యార్థి.. చిన్నారి ప్రద్యూమన్‌ను హత్య చేసినట్లు సీబీఐ పోలీసులు తేల్చారు. అయితే సీసీటీవీ ఫూటేజ్ ప్రకారం డ్రైవర్ అశోక్‌కు ఈ కేసుతో సంబంధం లేదని తేల్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్ : కీర్తి సురేష్

రోషన్, అనస్వర రాజన్.. ఛాంపియన్ నుంచి గిర గిర గింగిరాగిరే సాంగ్

Vanara: సోషియో ఫాంటసీ కథతో అవినాశ్ తిరువీధుల మూవీ వానర

Akhanda 2: అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments