Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్లపైకి రావొద్దని చెప్పినందుకు ఏఎస్ఐ చేతి నరికేశారు...

Webdunia
ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (15:57 IST)
లాక్‌డౌన్ సమయంలో రోడ్లపైకి రావొద్దంటూ సూచనలు చేసిన ఏఎస్ఐ చేతిని నరికేశారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలలో జరిగింది. మండీ బ‌జార్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాన్ని పరిశీలిస్తే, కర్ఫ్యూ నడుస్తున్నందున పాసులు చూపించాలని యువకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యువకులు అక్కడ ఏర్పాటు చేసిన బారికేట్లను జీపుతో గుద్దుకుంటూ వెళ్లిపోయారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై కత్తులతో దాడికిపాల్పడ్డారు. 
 
ఈ దాడిలో ఏఎస్‌ఐ చేతు పూర్తిగా తెగిపోయింది. మరో ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన చండీఘడ్‌లోని పీజీఐఎంఆర్‌ ఆస్పత్రికి తరలించారు. ఏఎస్‌ఐ హర్జిత్‌ సింగ్‌ చేతికి సర్జరీ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులందరిని గుర్తించామని, నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఎస్పీ హెచ్చరించారు. 
 
అంతేకాకుండా, నిందితుల అరెస్టు కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు వేగంగా స్పందింస్తూ, దాడికి పాల్పడిన ఏడుగురిని అరెస్టు చేశారు. ఓ ప్రార్థనా మందిరం నుంచి వారిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments