Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

ఠాగూర్
ఆదివారం, 19 మే 2024 (12:27 IST)
భారత్ తీసుకున్న చర్యల కారణంగానే పాకిస్థాన్‌ భిక్షాటన చేయాల్సిన దుస్థితి వచ్చిందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అంతేకాకుండా తాను ప్రధానమంత్రిగా మూడోసారి భాగస్వామ్యం అయిన ఆరు నెలల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఇపుడు పాకిస్థాన్‌కు పీవోకేను రక్షించుకోవడం ఇబ్బందిగా మారిందన్నారు. 
 
శనివారం మహారాష్ట్రలోని పాల్టర్‌లో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీరు కాపాడుకోవడం పాకిస్థాన్‌కు సంక్లిష్టంగా మారింది. మోడీని మూడోసారి ప్రధాని కానివ్వండి. ఆరు నెలల్లో పీవోకే భారత్‌లో భాగమవుతుంది. ఇలాంటి పని చేయాలంటే ధైర్యం ఉండాలి అని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 
 
కాగా పాక్ ఆక్రమిత కాశ్మీరులో ఈ మధ్య పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. స్థానిక ప్రజలు, పాకిస్థాన్ దళాల మధ్య కూడా పలుమార్లు ఘర్షణలు జరిగాయి. దీంతో పాకిస్థాన్ పట్ల అక్కడి ప్రజల్లో వ్యతిరేక భావన నెలకొందనే విశ్లేషణలు మరోసారి ఊపందుకున్న విషయం తెలిసిందే.
 
ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం నక్సలిజం, ఉగ్రవాదం అణచివేతకు దృఢమైన వైఖరితో ఉందని, ఈ మేరకు గత 10 ఏళ్లలో కొత్త భారత్ను చూశామని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దేశ సరిహద్దులకు భద్రత కల్పించామని, ఉగ్రవాదం, నక్సలిజం అరికట్టామని అన్నారు. ముంబై పేలుళ్లు జరిగినప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం హయాంలో ఉగ్రవాదులు సరిహద్దు దాటి భారతదేశంలోకి వచ్చారని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments