Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసు దోచుకున్న గ్రామమేదీ?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసును ఓ గ్రామవాసులు దోచుకున్నారు. తమ గ్రామంలో టాయిలెట్లను నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి నిధులను తీసుకోకుండా, గ్రామస్థులు ఎవరికి వారే సొంత డబ్బుతో మరుగుదొడ్లు కట్టించుకున్నా

Webdunia
ఆదివారం, 25 జూన్ 2017 (16:21 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసును ఓ గ్రామవాసులు దోచుకున్నారు. తమ గ్రామంలో టాయిలెట్లను నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి నిధులను తీసుకోకుండా, గ్రామస్థులు ఎవరికి వారే సొంత డబ్బుతో మరుగుదొడ్లు కట్టించుకున్నారు. ఆ గ్రామం పేరు బిజ్నూర్. దీనిపై ప్రధాని స్పందించారు. ఈ గ్రామ వాసులు తన మనసును దోచుకున్నారంటూ ప్రశంసించారు. 
 
ఆకాశవాణి మాధ్యమంగా తన 33వ 'మన్ కీ బాత్' ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ, రంజాన్ పర్వదినం జరుపుకోవడానికి సిద్ధమైన ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వచ్ఛ భారత్‌ కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఉద్యమం, ప్రజల్లోకి వెళ్లిందన్నారు. 
 
ఎమర్జెన్సీ సమయాన్ని గురించి ప్రస్తావించిన మోడీ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి రచించిన ఓ పద్యాన్ని గుర్తు చేసుకున్నారు. దేశంలోని అత్యయిక స్థితి, ప్రజలను ఏకతాటిపై నడిపించి, ప్రజాస్వామ్య విలువలను పెంచిందని తెలిపారు. 
 
తనకు అహ్మదాబాద్‌కు చెందిన డాక్టర్ అనిల్ సోనారా నుంచి ఓ విలువైన సలహా వచ్చిందని, ఎవరైనా ఎవరికైనా బహుమతులు ఇవ్వాలంటే మంచి పుస్తకాలను ఇచ్చేలా తన నోటి నుంచి సలహా ఇవ్వాలని ఆయన కోరారని ఆ ప్రకారంగానే తాను దేశ ప్రజలందరికీ సూచన చేస్తున్నట్టు చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments