Webdunia - Bharat's app for daily news and videos

Install App

డుమ్మా కొడితే వేటు తప్పదు... ఆ మంత్రుల జాబితా సిద్ధం చేయండి : మోడీ

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (17:21 IST)
పార్లమెంట్ సమావేశాలకు డుమ్మా కొడుతున్న మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర హెచ్చరిక చేశారు. పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరయ్యే కేంద్ర మంత్రుల జాబితాను సిద్ధం చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు కేంద్ర మంత్రుల హాజరుపలుచగా ఉంది. ఈ విషయాన్ని గమనించిన ప్రధాని నరేంద్ర మోడీ సభకు డుమ్మా కొడుతున్న వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి మంత్రుల జాబితాను సిద్ధం చేయాలని ఆయన కోరారు. 
 
పైగా, మంత్రులకు ఇంకా ఆయా శాఖలపై ఇంకా పట్టురాలేదనీ ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌కు రాని మంత్రుల జాబితా సిద్ధం చేయాలని మోడీ ఆదేశించారు. ఇలాంటి మంత్రుల జాబితాను మంగళవారం సాయంత్రానికంతా తనకు ఇవ్వాలని బీజేపీ పార్లమెంటరీ పార్టీని, పార్లమెంట్ వ్యవహారాల శాఖల మంత్రిని ఆదేశించారు. 
 
పార్లమెంట్‌లో సభ్యులు అడిగే ప్రశ్నలకు కేబినెట్ మంత్రులు కాకుండా.. సహాయ మంత్రులు సమాధానం ఇవ్వడం.. మరికొంతమంది తమ అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడుగానీ, సభ్యులు ప్రశ్నిస్తున్నప్పుడుగానీ సభలో లేకపోవడంపై మోడీ మండిపడ్డారు. రాజకీయాలకు ఆతీతంగా ఎంపీలు పని చేయాలని, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని సూచించారు. దేశంలో అనేక చోట్ల ఏర్పడిన నీటి ఎద్దడి గురించి ప్రస్తావించిన ఆయన.. జల్ అభియాన్ పథకాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments