Webdunia - Bharat's app for daily news and videos

Install App

డుమ్మా కొడితే వేటు తప్పదు... ఆ మంత్రుల జాబితా సిద్ధం చేయండి : మోడీ

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (17:21 IST)
పార్లమెంట్ సమావేశాలకు డుమ్మా కొడుతున్న మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర హెచ్చరిక చేశారు. పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరయ్యే కేంద్ర మంత్రుల జాబితాను సిద్ధం చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు కేంద్ర మంత్రుల హాజరుపలుచగా ఉంది. ఈ విషయాన్ని గమనించిన ప్రధాని నరేంద్ర మోడీ సభకు డుమ్మా కొడుతున్న వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి మంత్రుల జాబితాను సిద్ధం చేయాలని ఆయన కోరారు. 
 
పైగా, మంత్రులకు ఇంకా ఆయా శాఖలపై ఇంకా పట్టురాలేదనీ ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌కు రాని మంత్రుల జాబితా సిద్ధం చేయాలని మోడీ ఆదేశించారు. ఇలాంటి మంత్రుల జాబితాను మంగళవారం సాయంత్రానికంతా తనకు ఇవ్వాలని బీజేపీ పార్లమెంటరీ పార్టీని, పార్లమెంట్ వ్యవహారాల శాఖల మంత్రిని ఆదేశించారు. 
 
పార్లమెంట్‌లో సభ్యులు అడిగే ప్రశ్నలకు కేబినెట్ మంత్రులు కాకుండా.. సహాయ మంత్రులు సమాధానం ఇవ్వడం.. మరికొంతమంది తమ అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడుగానీ, సభ్యులు ప్రశ్నిస్తున్నప్పుడుగానీ సభలో లేకపోవడంపై మోడీ మండిపడ్డారు. రాజకీయాలకు ఆతీతంగా ఎంపీలు పని చేయాలని, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని సూచించారు. దేశంలో అనేక చోట్ల ఏర్పడిన నీటి ఎద్దడి గురించి ప్రస్తావించిన ఆయన.. జల్ అభియాన్ పథకాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments