Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు పీఎం కిసాన్ నిధులు పంపిణీ - 12వ విడతలో రూ.16 వేల కోట్లు

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2022 (08:25 IST)
పీఎం కిసాన్ పథకం కింద సోమవారం నిధులు పంపిణీ చేయనున్నారు. 12వ దశలో మొత్తం 16 వేల కోట్ల రూపాయలను పంపిణీ చేస్తారు. అలాగే, దేశంలో ఉన్న 2.7 లక్షల ఎరువుల చిల్లర దుకాణాలను దశలవారీగా వన్‌స్టాప్‌ సెంటర్లుగా మార్చి వాటికి ‘పీఎం సమృద్ధి కేంద్రాలు’గా నామకరణం చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. 
 
రైతులకు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, భూసార పరీక్ష సౌకర్యాలు, అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల గురించి సమాచారాన్ని వీటిల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 
 
అదేవిధంగా ఈ నెల 17వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అగ్రి స్టార్టప్‌ సదస్సు/ ఎగ్జిబిషన్‌ను, 600 ‘పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాల’ను ప్రధాని ప్రారంభిస్తారని తెలిపారు. సుమారు 300 అంకుర పరిశ్రమలు తమ నవకల్పనలను ప్రదర్శిస్తాయన్నారు. రైతులకు ‘పీఎం సమ్మాన్‌ నిధి’ 12వ విడత కింద రూ.16 వేల కోట్లను ప్రధాని విడుదల చేయనున్నారనీ, ఇప్పటివరకు రూ.2.16 లక్షల కోట్లు విడుదల చేసినట్లవుతుందని ఆయన వివరించారు. 
 
‘ఒకే దేశం ఒకే ఎరువు’ ఇతివృత్తంతో భారత్‌ యూరియా, భారత్‌ డీఏపీ, భారత్‌ ఎంఓపీ, భారత్‌ ఎన్‌పీకే బస్తాలను ప్రధాని మోడీ విడుదల చేస్తారన్నారు. వీటన్నింటినీ భారత్‌ పేరుతో విడుదల చేయడంవల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments