నేడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటన

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (12:00 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఈ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌తో పాటు తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు వందేభారత్ రైళ్లతోపాటు రూ.12 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. 
 
అలాగే, వజీద్‌పూర్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ర్యాలీ అనంతరం 'టిఫిన్ పే చర్చా' కార్యక్రమం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా తొలుత గోరఖ్‌పూర్ చేరుకుని గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కమిటీ ఇటీవల గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహమతి-2021 ప్రకటించింది. 
 
అలాగే, గోరఖ్‌పూర్ - లక్నో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు జెండా ఊపి ప్రారంభిస్తారు. జోధ్‌పూర్ సబర్మతి వందే భారత్ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 
 
ఆ తర్వాత వారణాసి చేరుకుని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ రైల్వే స్టేషన్, సన్ నగర్ మధ్య ఫ్రైట్ కారిడారు, వారణాసి - జైపూర్‌ను కలిపే జాతీయ రహదారి 56 నాలుగు లేన్ల విస్తరణ పనులను, మణికర్ణిక ఘాట్, హరీశ్ చంద్రఘాట్ పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలోని 10 అంతస్తుల ఇంటర్నేషనల్ హాస్టల్‌ను కూడా ప్రధాని మోడీ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments