Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూర్తిస్థాయి లాక్డౌన్ వైపు ప్రధాని మోడీ అడుగులు???

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (22:18 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. పైగా, సమూహ వ్యాప్తి వైపు పయనిస్తున్నట్టుగా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు రంగంలోకి దిగారు. దేశంలో కరోనా వైరస్ కేసుల నమోదు ప్రారంభమైన తర్వాత ఇప్పటికే పలుమార్లు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఇపుడు మరోమారు లాక్డౌన్ అంశంపై మాట్లాడేందుకు ఆయన నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
ఇందులోభాగంగా ఈ నెల 16, 17 తేదీల్లో ముఖ్యమంత్రులతో మాట్లాడేందుకు షెడ్యూల్ రూపొందించారు. 16వ తేదీ మంగళవారం పంజాబ్, అసోం, కేరళ, ఉత్తరాఖండ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా పరిస్థితులపై చర్చించనున్నారు. 
 
ఇక, తెలుగు రాష్ట్రాల సీఎంతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ 17వ తేదీ 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 
 
కాగా, ఇప్పటివరకు దేశంలో 2.98 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,498 మంది మరణించారు. 1.47 లక్షల మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అయితే, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రం ఈ కేసుల నమోదులో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments