Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు ప్ర‌ధాని నరేంద్ర మోడీ ఉప‌వాస దీక్ష‌

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం దీక్ష చేయనున్నారు. గురువారం రోజంతా పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా ఉపవాస దీక్ష చేయనున్నారు. ఇంత‌కీ ఈ దీక్ష ఎందుకంటే.. ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను ప్

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (09:54 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం దీక్ష చేయనున్నారు. గురువారం రోజంతా పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా ఉపవాస దీక్ష చేయనున్నారు. ఇంత‌కీ ఈ దీక్ష ఎందుకంటే.. ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను ప్రతిపక్షాలు స్తంభింపజేసినందుకు నిరసనగా ఈ ఉపవాస దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ ఎంపీలతో కలిసి ఆయన ఈ దీక్ష చేయనున్నారు. 
 
అయితే, ఆయ‌న దీక్ష చేసినా.. రోజువారీ విధులకు ఆటంకం కలగకుండానే ఆయన చేస్తారని, ఫైళ్ల క్లియరెన్స్‌ యధావిధిగా ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే కర్ణాటకలోని హుబ్లీ పర్యటనలో ఉండనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా అక్కడే తన ఉపవాస దీక్షను కొనసాగించనున్నారు. 
 
పార్లమెంటును కాంగ్రెస్‌ స్తంభింపజేసినందుకు నిరసనగా ఈనెల 12వ తేదీన బీజేపీ ఎంపీలు ఉపవాస దీక్ష చేస్తారని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, తాను కూడా దీక్షలో కూర్చుంటున్నానని మంగళవారం ఆయన ప్రకటించారు. ఇక, బీజేపీ ఎంపీలంతా వారి నియోజకవర్గాల్లో ఈ దీక్షలో పాల్గొననున్నారు. మ‌రి.. ప్ర‌ధాని దీక్ష గురించి ప్ర‌తిప‌క్షం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments