Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏంటీ... మీకు ఫేస్ బుక్ అకౌంట్ లేదా? భాజపా ఎంపీలకు నరేంద్ర మోదీ క్లాస్

2019 ఎన్నికల నాటికి మళ్లీ విజయ ఢంకా మోగించాలంటే పక్కా ప్రణాళిక ద్వారా ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లాల్సి వుందని భాజపా ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలు చేసారు. ఈ రోజు జరిగిన భాజపా పార్లమెంటరీ సమా

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (15:02 IST)
2019 ఎన్నికల్లో మళ్లీ విజయ ఢంకా మోగించాలంటే పక్కా ప్రణాళిక ద్వారా ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లాల్సి వుందని భాజపా ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలు చేసారు. ఈ రోజు జరిగిన భాజపా పార్లమెంటరీ సమావేశంలో పలు విషయాలపై లోతుగా చర్చ జరిపారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు తమపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను భాజపా ఎంపీలు ఎదుర్కోవడం లేదనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. 
 
దీనికి కారణం... భాజపా ఎంపీల్లో చాలామంది సోషల్ నెట్వర్కింగ్ సైట్లను సమర్థవంతంగా వినియోగించుకోవడం లేదని కూడా తేలింది. ఎంపీల్లో సింహభాగం ట్విట్టర్ ఖాతాలు లేవని చర్చలో తేలింది. అంతేకాదు 43 మంది భాజపా ఎంపీలకు ఫేస్ బుక్ ఖాతాలు లేవని కూడా ప్రధాని దృష్టికి వచ్చింది. దీనితో నరేంద్ర మోదీ దీనిపైనే వారికి క్లాసులు పీకినట్లు చెపుతున్నారు. ఒక్కో ఎంపీకి కనీసం మూడు లక్షల మంది ఫాలోయర్లు ఉండాలని టార్గెట్ విధించినట్లు సమాచారం.
 
వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికి టెక్నాలజీని ఉపయోగించుకోకుంటే వెనుకబడిపోతామని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందువల్ల ప్రతి ఒక్క భాజపా ఎంపీ ఖచ్చితంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఖాతాలను తెరిచి దాని ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహనకు తీసుకురావాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments