Webdunia - Bharat's app for daily news and videos

Install App

2600 పడకలతో అతిపెద్ద ఆస్పత్రిని ప్రారంభించిన ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (20:19 IST)
దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రి హర్యానా రాష్ట్రంలో నిర్మించారు. మొత్తం 2600 పడకల సౌకర్యంతో నిర్మించిన ఈ ఆస్పత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. ఆధునిక, సాంకేతికతల మేళవింపుగా నిర్మించిన ఈ ఆస్పత్రిరి అమృత హాస్పిటల్ అని పేరు పెట్టారు. 
 
ఈ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్, మాతా అమృతానందమయి తదితరులు పాల్గొన్నారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ ఆస్పత్రిని ఆరేళ్లపాటు శ్రమించి నిర్మించారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో పూర్తిగా ఆటోమేటిక్ ల్యాబ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. మాతా అమృతానందమయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశంలో వైద్య రంగానికి, ఆధ్యాత్మికతకు ఎంతో సామీప్యత ఉందన్నారు. ఇందుకో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఓ మంచి ఉదాహరణ అని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం కావడానికి ఆధ్యాత్మిక - ప్రైవేటు భాగస్వామ్యమే కారణమని తెలిపారు. 
 
ఈ ఆస్పత్రిని 130 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో పరిశోధనల కోసం ఏడు అంతస్తుల్లో భవనాన్ని నిర్మించగా, 500 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి విభాగం కూడా ఉంది. వచ్చే ఐదేళ్లలో ఈ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments