Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పంచతంత్రం' సమాప్తం - ధరల పెంపుపై హింట్స్ ఇచ్చిన ప్రధాని మోడీ

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (08:25 IST)
రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మధ్య, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యుద్ధం ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా, ప్రపంచంలోని ప్రతి దేశాన్ని ప్రభావితం చేస్తోందని అన్నారు. 
 
నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు, పొద్దుతిరుగుడు నూనె, పామాయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని గుర్తుచేశారు. అంటే మన దేశంలోనూ వీటి ధరలు పెరిగే అవకాశం లేకపోలేదని ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. 
 
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వంటగ్యాస్, బొగ్గు లేదా ఎరువుల ధరలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. కాగా, ఇప్పటికే ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. దీంతో దేశంలో పెట్రోల్ డీజల్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments