Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మరో రికార్డు సృష్టించనున్న ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (14:21 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో మరో రికార్డు సృష్టించనున్నారు. ఈ నెల 22వ తేదీన అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ మేరకు వైట్ హౌస్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ తదితరలు ఆహ్వానం పంపించారు. దీనికి ప్రధాని మోడీ సైతం ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఆహ్వానం తనకెంతో గర్వకారణంగా ఉందని చెప్పారు. దీంతో ప్రధాని మోడీ అమెరికా కాంగ్రెస్‌లో రెండుసార్లు ప్రసంగించిన భారత ప్రధానిగా నరేంద్ర మోడీ అమెరికాలో రికార్డు సృష్టించనున్నారు.
 
కాగా, ఈ నెల 22వ తేదీన ప్రధాని మోడీ అమెరికా ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. భారత దేశ భవిష్యత్ కార్యాచరణ, ఇరు దేశాలు ఉమ్మడిగా ఎదుర్కొంటున్న సవాళ్ళు తదితర అంశాలపై ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ సైతం ఓ అధికారిక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
కాగా, మోడీకి ఇది రెండో అధికారిక అమెరికా పర్యటన. 2016 జూన్‌లో ఆయన తొలిసారిగా అగ్రరాజ్యంలో పర్యటించారు. ఇప్పటివరకూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ మాత్రమే అమెరికా చట్టసభల్లో రెండు పర్యాయాలు ప్రసంగించారని భారత అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments