Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మరో రికార్డు సృష్టించనున్న ప్రధాని మోడీ

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (14:21 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో మరో రికార్డు సృష్టించనున్నారు. ఈ నెల 22వ తేదీన అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈ మేరకు వైట్ హౌస్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ తదితరలు ఆహ్వానం పంపించారు. దీనికి ప్రధాని మోడీ సైతం ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఆహ్వానం తనకెంతో గర్వకారణంగా ఉందని చెప్పారు. దీంతో ప్రధాని మోడీ అమెరికా కాంగ్రెస్‌లో రెండుసార్లు ప్రసంగించిన భారత ప్రధానిగా నరేంద్ర మోడీ అమెరికాలో రికార్డు సృష్టించనున్నారు.
 
కాగా, ఈ నెల 22వ తేదీన ప్రధాని మోడీ అమెరికా ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. భారత దేశ భవిష్యత్ కార్యాచరణ, ఇరు దేశాలు ఉమ్మడిగా ఎదుర్కొంటున్న సవాళ్ళు తదితర అంశాలపై ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ సైతం ఓ అధికారిక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
కాగా, మోడీకి ఇది రెండో అధికారిక అమెరికా పర్యటన. 2016 జూన్‌లో ఆయన తొలిసారిగా అగ్రరాజ్యంలో పర్యటించారు. ఇప్పటివరకూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ మాత్రమే అమెరికా చట్టసభల్లో రెండు పర్యాయాలు ప్రసంగించారని భారత అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments