Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెను విషాదం ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోడీ...

ఠాగూర్
శుక్రవారం, 13 జూన్ 2025 (10:02 IST)
తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో గురువారం పెను విషాదం చోటుచేసుకున్న ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సందర్శించనున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మృత్యువాతపడ్డారు. ఈ హృదయ విదాకర ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాద స్థలాన్ని ఆయన శుక్రవారం సందర్శించి, మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. 
 
కాగా, ఈ భయానక ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్నవారిలో ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం స్వల్ప గాయాలతో అదృష్టవశాత్తూ సజీవంగా బయటపడ్డాడు. మిగిలిన 241 మంది ప్రయాణికులు అగ్నికోరల్లో చిక్కుకుని దహనమైపోయారు. ఈ మృతుల్లో గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (68) కూడా ఉండటం గమనార్హం. కాగా, ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తునకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను దర్యాప్తు అధికారులు వెలుగులోకి తీసుకునిరానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments